స్పెయిన్: గత 24 గంటల్లో 757 కరోనా మరణాలు

- April 08, 2020 , by Maagulf
స్పెయిన్: గత 24 గంటల్లో 757 కరోనా మరణాలు

మాడ్రిడ్ :స్పెయిన్ లో కరోనా వైరస్ మళ్ళీ విజృంభించడం ప్రారంభించింది. వరుసగా రెండో రోజు మరణాల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 757 మంది మరణించారు. దాంతో బుధవారం రెండవ రోజు వరుసగా స్పెయిన్లో రోజువారీ కరోనావైరస్ మరణాల సంఖ్య 2 శాతం పెరిగిందని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. దీంతో స్పెయిన్లో కరోనావైరస్ వలన సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 14,555 కు పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం మరణాల సంఖ్యలో రోజువారీ పెరుగుదల బుధవారం 5.7 శాతంగా ఉంది, అంతకు ముందు రోజు 743 మంది మరణించారు అప్పుడు 5.5 శాతం మరణాల రేటు ఉంది. అయితే గతంతో పోల్చుకుంటే మరణాల సంఖ్యలో రోజువారీ వేగం కొద్దిగా తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదిలావుంటే కేసులు కూడా 146.690 కు చేరుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com