కరోనా/అమెరికా:11 మంది భారతీయుల మృతి

- April 09, 2020 , by Maagulf
కరోనా/అమెరికా:11 మంది భారతీయుల మృతి

వాషింగ్టన్:కరోనా మహమ్మారి తో అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే 14 వేలమందికి పైగా మృతి చెందారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 2 వేల మంది మృత్యువాత పడ్డారు. కరోనా ఎఫెక్ట్‌ అమెరికాలో ఉంటున్న భారతీయులపై కూడా పడింది. కఠిన నిబంధనలతో భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయంగా ప్రయాణాలు నిలిచిపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే.. ఇందులో పలువురు కరోనా బారినపడి చనిపోయినట్లు తెలుస్తోంది. మరికొందరు చికిత్స పొందుతున్నారు.

ఇప్పటివరకు 11 మంది భారతీయులు కరోనాతో చనిపోయినట్లు సమాచారం. వీరిలో 10 మంది న్యూయార్క్‌, న్యూజెర్సీ నగరాలకి చెందిన వారు కాగా, ఒక్కరు ఫ్లోరిడాలో నివాసం ఉంటన్న వ్యక్తిగా అధికారులు గుర్తించారు. మృతుల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లని తెలిసింది. ఇదిలావుంటే నలుగురు మహిళలు సహా మరో 16 మంది భారతీయులు కరోనా లక్షణాలతో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది న్యూయార్క్‌లో, ముగ్గురు న్యూజెర్సీలో, మిగిలినవారు టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఉన్నారు. వారంతా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com