ఏపీలో కరోనా వాలంటీర్ పోస్టులు..
- April 09, 2020
అమరావతి: కరోనా మహమ్మారిపై యుద్ధానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ వారియర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రాణాంతక వైరస్ను అరికట్టేందుకు కోవిడ్ వారియర్ వాలంటీర్లను నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఏపీలో ఉన్న మెడికల్ కాలేజీలు, ఆయుర్వేద నర్సింగ్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, యునాని, ఇతరత్రా వైద్య సంబంధిత కోర్సులు చదువుతున్న విద్యార్థులకు కోవిడ్ వారియర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు రెండూ ఒకటి కాదా..
కరోనాను సమర్థవంతంగు ఎదుర్కొనేందుకు కోవిడ్ వాలంటీర్లను నియమించనున్నట్లు ఏపీ కోవిడ్ ప్రత్యేకాధికారి ఎం. గిరిజాశంకర్ తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమంలో నైపుణ్యం కలిగిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, వైద్య సంబంధిత విద్యార్థులు, నర్సుల సేవల్ని క్వారంటైన్ సెంటర్లలో కోవిడ్ వారియర్ వాలంటీర్లుగా వినియోగించుకోనున్నామని చెప్పారు. వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వాలంటీర్ల సేవలు అందించాల్సి ఉంటుందన్నారు.
కరోనా కష్టకాలంలో మహమ్మారిని అరికట్టేందుకు ఆసక్తి కలిగిన వారు వాలంటీర్లుగా నమోదు చేసుకునేందుకు ఏపీ సర్కార్ ఓ వెబ్ సైట్ ప్రారంభించింది. https://health.ap.gov.in/CVPASSAPP/Covid/VolunteerJobs ఈ వెబ్సైట్లో కోవిడ్ వారియర్ వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. మెడికల్ సిబ్బంది, ఉత్సాహవంతులైన యువత కూడా వాలంటీర్లుగా నమోదు చేసుకుంటున్నారని వివరించారు. ఆన్లైన్లో శిక్షణ ఇచ్చిన అనంతరం వారు కోరుకున్న జిల్లాలోనే సేవలు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
కోవిడ్ కష్ట కాలంలో వాలంటీర్లుగా చేసేందుకు ఆసక్తి చూపి ముందుకొస్తున్న వారికి ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ఏపీ ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టే ఉద్యోగ నియామకాలలో కోవిడ్ వారియర్ వాలంటీర్లకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు