కోవిడ్:ఎంపిక చేసిన ఫెడరల్ ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవులు
- April 09, 2020
యూఏఈ:కరోనా విపత్తు సమయంలో ఉద్యోగులకు బాసట నిలిచింది యూఏఈ. ఫెడరల్ ఉద్యోగుల కుటుంబ పరిస్థితులను బట్టి జీతంతో కూడా సెలవులను ఇవ్వాలని యూఏఈ కేబినెట్ తీర్మానించింది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుం. 16 ఏళ్లలోపు పిల్లలు ఉన్న ఉద్యోగి కావాలంటే సెలవులు పెట్టుకోవచ్చు. ఈ సెలవు కాలానికి జీతంలో ఎలాంటి కోతలు ఉండవు. ఇక ఉద్యోగి భార్య స్వీయ నిర్బంధంలో ఉండి కుటుంబ సభ్యులకు దూరం పాటిస్తున్న పరిస్థితుల్లో పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా సెలవులు తీసుకొచ్చు. ఇక ఫెడరల్ ఉద్యోగి భార్య కీలకమైన వైద్య రంగంలో డాక్టర్, నర్స్, పారామెడికల్ తరహా మెడికల్ సేవలు అందిస్తున్నా, నిర్బంధ శిబిరాల్లో(క్వారంటైన్ సెంటర్స్) లో ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్నా ఆ ఉద్యోగి పెయిడ్ లీవ్స్ తీసుకోవచ్చు. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వేళ సదరు ఉద్యోగి నిత్యావసర సేవల విభాగాల్లో విధులు నిర్వహిస్తుంటే మాత్రం సెలవులు ఇవ్వటం కుదరదని, పని వేళల్లో మార్పులకు మాత్రమే అవకాశం ఉంటుందని కూడా మినిస్ట్రి ఆఫ్ పెడరల్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







