కరోనా పై పోరుకు లారెన్స్ రూ.3 కోట్లు విరాళం

- April 09, 2020 , by Maagulf
కరోనా పై పోరుకు లారెన్స్ రూ.3 కోట్లు విరాళం

ప్రముఖ సినీ నటుడు రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు తన వంతు సాయంగా రూ.3 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఇందులో సింహభాగం తన సొంత ఊరు రోయపురంలో కార్మికులు, రోజువారీ కూలీలకు అండగా నిలిచేందుకు రూ.75 లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా పీఎం కేర్స్ ఫండ్స్ కు రూ.50 లక్షలు, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్స్ కు రూ.50 లక్షలు, డ్యాన్సర్స్ యూనియన్ కు రూ.50 లక్షలు, దివ్యాంగుల కోసం రూ.25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తాను తీయనున్న కొత్త సినిమాకు వచ్చిన అడ్వాన్స్ నుంచి ఈ విరాళంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ప్రతీ రోజు నమస్తే తెలంగాణ తాజా వార్తలు కథనాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్యాప్ ను సబ్ స్క్రైబ్ చేసుకోగలరు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com