కువైట్: భారతీయులకు అమ్నెస్టీ పథకం(క్షమాభిక్ష) తేదీల్లో మార్పు
- April 09, 2020
కువైట్:సరైన డాక్యుమెంట్లు లేని ప్రవాసీయులకు కువైట్ ప్రకటించిన క్షమాభిక్ష పథకం లో స్వల్ప మార్పులు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసీయులు ఎలాంటి జరిమానా చెల్లించకుండా ఉచితంగా సొంత దేశాలకు వెళ్లే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే..ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు సహాయ కేంద్రాలను సంప్రదించేందుకు ప్రత్యేకంగా తేదీలను కూడా కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే భారత్, బంగ్లాదేశ్ కు సంబంధించిన తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది. క్షమాభిక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్న బంగ్లాదేశీయులు ఏప్రిల్ 11 నుంచి 15 వరకు ఫర్వానియాలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలను సంప్రదించాలని సూచించింది. అలాగే ఇండియన్స్ 11 ఏప్రిల్ కి బదులు 16 ఏప్రిల్ నుంచి 20 ఏప్రిల్ మధ్య సహాయ కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకోవాలిని మంత్రిత్వ శాఖ తెలిపింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు