పెరిగిన గృహహింస కేసులు
- April 10, 2020
కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలన్నీ కోవిడ్-19 నియంత్రణకు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ అమలు చేస్తున్న దేశాలన్నింటిలో గృహహింస పెరుగుడం ఆందోళన కలిగిస్తోంది. లాక్డౌన్తో ఉపాధి పోయిందన్న బాధ, నిరాశ, భవిష్యత్తుపై అనిశ్చితితో భర్తలు తమ అసహనాన్ని భార్యలపై చూపుతున్నట్లు కేసులను బట్టి తెలుస్తోంది. లాక్డౌన్తో భారత్లోనూ గృహహింస కేసుల సంఖ్య రెట్టింపు అయిందని జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లలో ఉంటున్న పురుషులు తమ అసహనాన్ని భార్యలపై ప్రదర్శిస్తున్నారని.. నాలుగు గోడలకే పరిమితమైన మహిళలు తమ గోడును ఎవరికి, ఎలా చెప్పకోవాలో తెలియక సతమతమవుతున్నారని రేఖాశర్మ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, గృహిణులు జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ +91 7217735372 ను కేటాయించింది. కోవిడ్-19, లాక్డౌన్ నేపథ్యంలో బాధలో ఉన్న లేదా గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలకు మద్దతు, సహాయం కోసం మహిళా కమిషన్ వాట్సాప్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. లాక్డౌన్ ముగిసేవరకు మాత్రమే ఈ నంబర్ పనిచేస్తుందని వివరించింది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







