తారక్ అభిమానులకి శుభవార్త..
- April 12, 2020
లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ తో పాటు సీరియల్స్, రియాలిటీ షోస్కి సంబంధించిన షూటింగ్స్ కూడా పూర్తిగా స్తంభించాయి. ఈ నేపథ్యంలో ఛానెల్స్ వారు గతంలో మంచి టీఆర్పీ రాబట్టిన కార్యక్రమాలని తిరిగి ప్రసారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుల్లితెరపై సంచలనం సృష్టించిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఆయా సమయంలో టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 3 మాటీవీలో ప్రసారం అవుతుండగా, సీజన్ 1ని స్టార్ మాలో ప్రసారం చేయబోతున్నారు.
వెండితెరపై ఎన్నో సంచలనాలు సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై బిగ్ బాస్ కార్యక్రమంతో తన టాలెంట్ మరోసారి నిరూపించుకున్నారు. 70 రోజుల పాటు 12 మంది సెలబ్రిటీలతో కలిసి మంచి వినోదాన్ని అందించారు. అప్పట్లో ఈ షో అన్ని కార్యక్రమాల రికార్డులని చెరిపేస్తూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇక ఈ రోజు సాయంత్రం నుండి ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 1 కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎన్టీఆర్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్తో ట్వీట్స్, రీట్వీట్స్ చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







