తారక్ అభిమానులకి శుభవార్త..
- April 12, 2020
లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ తో పాటు సీరియల్స్, రియాలిటీ షోస్కి సంబంధించిన షూటింగ్స్ కూడా పూర్తిగా స్తంభించాయి. ఈ నేపథ్యంలో ఛానెల్స్ వారు గతంలో మంచి టీఆర్పీ రాబట్టిన కార్యక్రమాలని తిరిగి ప్రసారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుల్లితెరపై సంచలనం సృష్టించిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఆయా సమయంలో టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 3 మాటీవీలో ప్రసారం అవుతుండగా, సీజన్ 1ని స్టార్ మాలో ప్రసారం చేయబోతున్నారు.
వెండితెరపై ఎన్నో సంచలనాలు సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై బిగ్ బాస్ కార్యక్రమంతో తన టాలెంట్ మరోసారి నిరూపించుకున్నారు. 70 రోజుల పాటు 12 మంది సెలబ్రిటీలతో కలిసి మంచి వినోదాన్ని అందించారు. అప్పట్లో ఈ షో అన్ని కార్యక్రమాల రికార్డులని చెరిపేస్తూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇక ఈ రోజు సాయంత్రం నుండి ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 1 కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎన్టీఆర్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్తో ట్వీట్స్, రీట్వీట్స్ చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







