కువైట్:ప్రవాసీయుల నివాస అనుమతిపై తప్పుడు ప్రచారం..చర్యలకు సిద్ధమవుతున్న మంత్రిత్వ శాఖ
- April 13, 2020
కువైట్:సోషల్ మీడియా వేదికగా ఎలాంటి అసత్య ప్రచారాలు, అపోహలు సృష్టించేలా కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కువైట్ అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నా కొందరు నెటిజన్లు మాత్రం హద్దు దాటుతూనే ఉన్నారు. తాజాగా ప్రవాసీయుల నివాస అనుమతులకు సంబంధించి ఓ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. 40 ఏళ్లకు పైబడిన ప్రవాసీయులకు ఇక నివాస అనుమతులను పునరుద్ధరించరని ఆ కథనాల్లోని సారాంశం. ఈ నిరాధారమైన ప్రచారంపై అధికారులు విచారణ ప్రారంభించారు. అకౌంట్ వివరాలు, దాని నిర్వాహకులు ఎవరో గుర్తించే పనిలో ఉన్నారు. ఉప ప్రధాని అనల్ అల్ సలహ్ సూచనల మేరకు ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే ఉపేక్షించేది లేదని మరోసారి అధికారులు హెచ్చరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







