యూఏఈ: ప్రవాసీయులను అనుమతించని దేశాల పట్ల అసంతృప్తి .కార్మిక ఒప్పందాలపై పునరాలోచన
- April 13, 2020
ప్రవాసీయుల తరలింపులో చిక్కులు ఎదుర్కొంటున్న యూఏఈ..భాగస్వామ్య దేశాల తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది. ఏయే దేశాలైతే తమ సొంత పౌరులను కూడా అనుతించటం లేదో ఆయా దేశాల పట్ల ఇక కఠినంగా వ్యవహరించాలనే యోచన చేస్తోంది. ఇందుకోసం కార్మిక ఒప్పందాలపై పునరాలోచన చేస్తున్నట్లు కూడా యూఏఈ వెల్లడించింది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తమ దేశంలోని ప్రవాసీయులను వారి వారి సొంత దేశాలకు తరలించేందుకు యూఏఈ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. వివిధ ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులు ప్రస్తుత విపత్తు సమయంలో తమ సొంత దేశానికి వెళ్లాలని అనుకుంటున్నారని, అయితే..ఆయా దేశాలు తమ పౌరులకు అనుమతి ఇవ్వకపోవటం విచారకరమని యూఏఈ భాగస్వామ్య దేశాల తీరును తప్పుబట్టింది. ప్రవాసీయులను తరలించటంలో భాగంగా అనుమతిని కోరుతూ పదే పదే సంప్రదించినా భాగస్వామ్య దేశాల నుంచి ఎలాంటి స్పందన లేదన్న యూఏఈ..అలాంటి దేశాలతో ఇక కార్మిక ఒప్పందాలపై పునరాలోచన చేస్తామని సుతిమెత్తగా హెచ్చరించింది. భవిష్యత్తులోనూ ఆయా దేశాల నుంచి కార్మికులను అనుమతించబోమని కూడా వెల్లడించింది. ఇప్పటికే అమలులో ఉన్న కార్మిక ఒప్పందాలను కూడా రద్దు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని యూఏఈ పేర్కొంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు