యూఏఈ: ప్రవాసీయులను అనుమతించని దేశాల పట్ల అసంతృప్తి .కార్మిక ఒప్పందాలపై పునరాలోచన
- April 13, 2020
ప్రవాసీయుల తరలింపులో చిక్కులు ఎదుర్కొంటున్న యూఏఈ..భాగస్వామ్య దేశాల తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది. ఏయే దేశాలైతే తమ సొంత పౌరులను కూడా అనుతించటం లేదో ఆయా దేశాల పట్ల ఇక కఠినంగా వ్యవహరించాలనే యోచన చేస్తోంది. ఇందుకోసం కార్మిక ఒప్పందాలపై పునరాలోచన చేస్తున్నట్లు కూడా యూఏఈ వెల్లడించింది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తమ దేశంలోని ప్రవాసీయులను వారి వారి సొంత దేశాలకు తరలించేందుకు యూఏఈ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. వివిధ ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులు ప్రస్తుత విపత్తు సమయంలో తమ సొంత దేశానికి వెళ్లాలని అనుకుంటున్నారని, అయితే..ఆయా దేశాలు తమ పౌరులకు అనుమతి ఇవ్వకపోవటం విచారకరమని యూఏఈ భాగస్వామ్య దేశాల తీరును తప్పుబట్టింది. ప్రవాసీయులను తరలించటంలో భాగంగా అనుమతిని కోరుతూ పదే పదే సంప్రదించినా భాగస్వామ్య దేశాల నుంచి ఎలాంటి స్పందన లేదన్న యూఏఈ..అలాంటి దేశాలతో ఇక కార్మిక ఒప్పందాలపై పునరాలోచన చేస్తామని సుతిమెత్తగా హెచ్చరించింది. భవిష్యత్తులోనూ ఆయా దేశాల నుంచి కార్మికులను అనుమతించబోమని కూడా వెల్లడించింది. ఇప్పటికే అమలులో ఉన్న కార్మిక ఒప్పందాలను కూడా రద్దు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని యూఏఈ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







