కోవిడ్ 19:భారీ శబ్ధాలతో ప్రశాంతతకు భంగం కలిగిస్తే వాహనాలు సీజ్
- April 13, 2020
మనామా:లాక్ డౌన్ విధింపుతో ఎక్కువ సమయంలో ఇంట్లోనే ప్రజల ప్రశాంతతకు ఇబ్బందులు తలెత్తకుండా బహ్రెయిన్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి భారీ శబ్ధాలతో వాహనాలను నడిపితే ఆ వాహనాలను వెంటనే స్వాధీనం చేసుకుంటామని ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ హెచ్చరించింది. స్వాధీనం చేసుకున్న వాహనాలను నెల వరకు తమ అధీనంలోనే ఉంటాయని కూడా వెల్లడించింది. లాక్ డౌన్ సమయంలో ఇళ్లలో ఉండే ప్రజల ప్రశాంతతకు అధిక ప్రధాన్యం ఇస్తామని, మరీ ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో శబ్ధాలు చేసుకుంటూ వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ప్రజలంతా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించినట్లు ప్రజలు ఒకే చోట గుమికూడొద్దని అధికారులు సూచించారు.
----రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!