కరోనా వైరస్పై పుకార్లు: స్పందించిన ప్రభుత్వం
- April 16, 2020
మస్కట్: గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్, కోరోనా వైరస్ విషయంలో సర్క్యులేట్ అవుతున్న పుకార్లని ఎవరూ నమ్మవద్దని సూచించింది. కరోనా వైరస్కి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారిక వివరాలు వెల్లడిస్తున్నట్లు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ పేర్కొంది. మస్కట్ బేకరీలో కరోనా వైరస్.. అంటూ జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు. ఏప్రిల్ 2న ఓ అధికారిక ప్రకటన వచ్చిందనీ, ఆ ప్రకటన ప్రకారం కరోనా నుంచి రికవర్ అయినవారి సంఖ్య 57 అంటూ గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ పాత ప్రకటన వివరాల్ని వెల్లడించింది. పుకార్ల పట్ల ఆకర్షితులవడం మంచిది కాదనీ, అదే సమయంలో ఫేక్ న్యూస్ని ప్రచారం చేయరాదని అధికారులు హెచ్చరించారు. ‘అధికారిక ప్లాట్ఫామ్ ద్వారా వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాం’ అని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!







