కరోనా వైరస్:ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కేసులు, మరణాలు
- April 17, 2020
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభణ ఆగకుండా కొనసాగుతూనే ఉంది. కరోనా కేసులు గత 24 గంటల్లోనే వేలాది పాజిటివ్ కేసులు నమోదైనట్టు నివేదికలు అందుతున్నాయి. అన్ని దేశాల్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,182,058 కు చేరింది. ఇందులో మొత్తం లక్షా 45 వేల మంది మృత్యువాత పడ్డారు. ఇక 5.5 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,483,991 యాక్టీవ్ కేసులు ఉండగా. ఇందులో అత్యధికంగా అమెరికాలో ఉన్నాయి. అమెరికాలో అయితే ఏకంగా 6.77 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే కొత్తగా 29 వేల కేసులు నమోదయ్యాయి.
అమెరికాలో మొత్తం 35 వేల మంది కరోనా బారిన పడి మరణించారు. ఇక యూకేలో గురువారం ఒక్కరోజే 861 మంది మరణించారు.. అలాగే ఫ్రాన్స్లో 753 మంది, ఇటలీలో 525 మంది, స్పెయిన్లో 503 మంది, బెల్జియంలో 417 మంది, జర్మనీలో 248 మంది, బ్రెజిల్లో 190 మంది, కెనడాలో 181 మంది నెదర్లాండ్స్లో 181 మంది, స్వీడన్ లో 130 మంది, టర్కీలో 125 మంది మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు