కువైట్: అవుట్ పాస్ ఫీజు మాఫీ చేసిన వి.మురళీధరన్
- April 17, 2020
కువైట్:కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షను దక్కించుకునేందుకు పెద్దయెత్తున ఇండియన్స్ ముందుకొస్తున్నారు. ఎలాంటి జరీమానాలూ లేకుండా దేశం విడిచి వెళ్ళేందుకు వీలుగా కువైట్ ప్రభుత్వం క్షమాభిక్షను తెరపైకి తెచ్చింది. ఫర్వానియా మరయు జిలీబ్ ప్రాంతాల్లో రెండు క్షమాభిక్ష కేంద్రాల్ని భారతీయుల కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 20 వరకు క్షమాభిక్ష అభ్యర్థనల్ని ఈ సెంటర్స్ స్వీకరిస్తాయి. ఉదయం 8 గంటల నంచి 2 గంటల వరకు ఇందుకు అనుమతినిస్తున్నారు.
పాస్ పోర్టులు అందుబాటులో లేని మనవారు ఇండియన్ ఎంబసీ ద్వారా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (తెల్లరంగులో ఉండే తాత్కాలిక పాస్ పోర్టు) పొందవచ్చు. ఇందుకు చెల్లించాల్సిన ఫీజు 5 దీనార్లు ను మాఫీ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఫీజు మాఫీ విషయాన్ని మంత్రి ఇంగ్లిష్, హిందీ తోపాటు మాతృభాష మలయాళంలో ట్విట్టర్ లో వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు