జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులో:ఆర్బీఐ గవర్నర్
- April 17, 2020
ముంబయి: సంక్షోభ సమయంలో బ్యాంకు సేవలు ప్రశంసనీయమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. శుక్రవారం ముంబయిలోని ఆర్బీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శక్తికాంత దాస్ మాట్లాడుతూ... కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొందన్నారు. ప్రస్తుత పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు.
‘‘ప్రపంచ మార్కెట్లన్నీ ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ఖరీఫ్లో 36 శాతం ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఏప్రిల్లో ఆహార ఉత్పత్తుల ధరలు 2.3శాతం పెరిగాయి. ఆటోమొబైల్ పరిశ్రమలో ఉత్పత్తి, అమ్మకాలు తగ్గాయి. విద్యుత్ వినియోం బాగా తగ్గింది. భారత్ జీడీపీ 1.9శాతంగా ఐఎంఎఫ్ అంచనావేసింది. జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చాం. బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగాసాగుతున్నాయి. 2021-22 ఏడాదికి వృద్ధిరేటు 7.4శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా దేశాల వృద్ధిరేట్లు తిరోగమనంలో ఉన్నాయి. జీ-20 దేశాల్లో భారత్ జీడీపీనే అధికం. లాక్డౌన్ తర్వాత రూ.1.20లక్షల కోట్లు విడుదల చేశాం. దేశ వ్యాప్తంగా 91శాతం ఎటీఎంలు పనిచేస్తున్నాయి. బ్యాంకులు, ఎటీఎంలలో ఎప్పటికప్పుడు నగదు నింపుతున్నాం. బ్యాంకుల్లో సరిపడా దవ్ర లభ్యత ఉంది. లాక్డౌన్ వల్ల ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్ డాలర్ల నష్టం’’ అని శక్తికాంత దాస్ వివరించారు.
ఆర్బీఐ కీలక నిర్ణయాలు..
* రెపో రేటు యథాతథం.
* రివర్స్ రెపోరేటు 4 శాతం నుంచి 3.75 శాతానికి (25 బేసిస్ పాయింట్లు) తగ్గింపు.
* రాష్ట్రాలకు 60శాతం మేర డబ్ల్యూఎంఏ పెంపు. సెప్టెంబరు 30 వరకు WMA పెంపు అమలు.
* జాతీయ హౌసింగ్ బోర్డుకు రూ.10వేల కోట్లు.
* నాబార్డుకు రూ.25వేల కోట్లు.
* చిన్నతరహా పరిశ్రమలకు రూ.50వేల కోట్లు..
* మారటోరియం సమయంలో 90 రోజుల ఎన్పీఏ గడువు వర్తించదు.
* సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ.50వేల కోట్లు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు