మూడోసారి ముఖ్యమంత్రులతో మోడీ భేటీ..
- April 22, 2020
ఢిల్లీ:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఏప్రిల్ 27న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై పరిస్థితులు సమీక్షించనున్నారు. కరోనావైరస్ మహమ్మారి ప్రబలిన సమయంలో వ్యాప్తిని అడ్డుకోవడానికి రెండు సార్లు లాక్ డౌన్ పొడిగించింది సీఎంల వీడియో కాన్ఫిరెన్స్ తర్వాతే.
మార్చి 20న తొలి సమావేశంలో పాల్గొన్న మోదీ.. మార్చి 22న జనతా కర్ఫ్యూ నిర్వహించి ఆ తర్వాత మార్చి 24 నుంచి 21 రోజుల లాక్డౌన్ విధించారు. రెండోసారి ఏప్రిల్ 11న వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొన్న పీఎం మోదీ.. లాక్డౌన్ ను మరికొద్ది రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
మూడోసారి ఏప్రిల్ 27న సమావేశమయ్యే క్రమంలో ఈ సారి ఎటువంటి సంచలన నిర్ణయం ఉంటుందోనని ప్రజలు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. మే3న ముగిసే లాక్ డౌన్ పొడిగిస్తారా.. లేదా చూడాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే మే8 వరకూ కొనసాగుతుందని సంచలన ప్రకటన చేసేశారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!