బహ్రెయిన్: కోవిడ్ 19 టెస్ట్ ల్యాబ్ లు పబ్లిక్ బస్సులు...
- April 25, 2020
బహ్రెయిన్:కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను బహ్రెయిన్ ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా మరింత ఎక్కువ సంఖ్యలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనుంది. ఇందుకోసం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బస్సులనే మొబైల్ ల్యాబులుగా మార్చింది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అనుగుణంగా బస్సులో అన్ని సదుపాయాలు, ఎక్విప్ మెంట్ అమర్చారు. మనామాలో ఇక నుంచి మొబైల్ ల్యాబ్ లలో పరీక్షలు నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి కమల్ బిన్ అహ్మద్ మొహమ్మద్ వెల్లడించారు. మనామాలో రోడ్ల మీదకు వచ్చే వారికి ఎక్కడికక్కడ టెస్ట్ లు నిర్వహిస్తామని, తద్వారా వ్యాధి తీవ్రత ఎంత మేరకు ఉందో అంచనాకు రాగలమని మంత్రి వివరించారు. దీనిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ప్రజా రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ తమ విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. ఇదిలాఉంటే బహ్రెయిన్ లో ప్రస్తుతం 2,518 మందికి వైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు వైరస్ కారణంగా 8 మంది చనిపోయారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







