అబుధాబి: మే 16 నుంచి ఎతిహాద్ విమాన సర్వీసులు ప్రారంభం

- April 25, 2020 , by Maagulf
అబుధాబి: మే 16 నుంచి ఎతిహాద్ విమాన సర్వీసులు ప్రారంభం

అబుధాబి:కరోనా వైరస్ నేపథ్యంలో సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్ పౌర విమానయాన సంస్థ తమ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. మే 16 నుంచి సాధారణ సర్వీసులు ప్రారంభిస్తామని సంస్థ అధికారులు వెల్లడించారు. టికెట్ల బుకింగ్స్ కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి యూఏఈ ప్రభుత్వంతో పాటు గ్లోబల్ ఏవియేషన్ అధికారులతోనూ సంప్రదిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి పాక్షిక షెడ్యూల్ తోనే సర్వీసులను నడుపుతామని పరిస్థితులు చక్కబడగానే క్రమంగా పూర్తిస్థాయిలో సర్వీసులను నడుపుతామని ఎతిహాద్ తన అధికారిక వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది. అయితే..కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ సర్వీసులు రద్దు అవటంతో ఇక్కడే చిక్కుకుపోయిన విదేశీయులను వారి స్వదేశాలకు తరలించేందుకు యూఏఈ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు వెల్లడించింది. మే 15 వరకు విదేశీయులను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని వివరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com