మూడు ఫ్యాక్టరీలకు జరీమానా

- April 25, 2020 , by Maagulf
మూడు ఫ్యాక్టరీలకు జరీమానా

రస్‌ అల్‌ ఖైమా:మూడు ఫ్యాక్టరీలు, స్టోరేజ్‌ రూల్స్‌ని పాటించని కారణంగా జరీమానాకు గురయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఈ మేరకు చర్యలు ఈసుకుంది. ఆ ఫ్యాక్టరీల కారణంగా రస్‌ అల్‌ ఖైమాలోని అల్‌ ఘెయిల్‌ ప్రాంతంలో దుర్వాసన వ్యాపించింది. ఇంజిన్‌ ఆయిల్స్‌ని రీసైక్లింగ్‌ చేయడం, తయారు చేయడం వంటి కార్యకలాపాలు ఈ కంపెనీల్లో జరుగుతున్నాయి. ఈ తరహా ఫ్యాక్టరీలు మరింత ఖచ్చితత్వంతో పరిశుభ్ర వాతావరణాన్ని మెయిన్‌టెయిన్‌ చేయాలనీ, దుర్వాసనకు అస్సలేమాత్రం కారకాలు కాకుండా వుండాలని అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సైఫ్‌ అల్‌ ఘాయిస్‌ స్పష్టం చేశారు. ఇంజిన్‌ ఆయిల్స్‌ తగిన టెంపరేచర్‌లో భద్ర పరచాల్సి వుంటుంది. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, ఫ్యాక్టరీలు భద్రతా ప్రమాణాలు, స్టోరేజ్‌ నిబంధనలు పాటించాలని స్పష్ట చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com