COVID-19/అబుధాబి: మే 1 నుండి పాక్షికంగా ప్రారంభం కానున్న కాన్సులర్ సేవలు

- April 28, 2020 , by Maagulf
COVID-19/అబుధాబి: మే 1 నుండి పాక్షికంగా ప్రారంభం కానున్న కాన్సులర్ సేవలు

అబుధాబి: అబుధాబిలోని ఇండియన్ మిషన్ కాన్సులర్ సేవలను మే 1 నుండి పాక్షికంగా ప్రారంభిస్తాయని అబుధాబిలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది. 

ఐవిఎస్ ఇంటర్నేషనల్ (ఐవిఎస్ గ్లోబల్ సర్వీసెస్, అబుధాబి విశ్వవిద్యాలయ భవనం, అల్ నహ్యాన్ క్యాంప్ ఏరియాలో 7 వ అంతస్తు, మురూర్ రోడ్‌) ద్వారా సేవలు పాక్షికంగా తిరిగి ప్రారంభించబడ్డాయి. ధృవీకరణ సేవలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. సెంటర్ లో తగిన సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్ కోసం [email protected] వద్ద ఐవిఎస్‌కు ముందస్తు ఇమెయిల్ పంపాలని అభ్యర్థించారు. దరఖాస్తుదారుకు ఏదైనా అత్యవసర ధృవీకరణ అవసరాలు ఉంటే, వారు [email protected] వద్ద రాయబార కార్యాలయానికి వ్రాయవచ్చు అని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com