కరోనా వైరస్: 52,000 జరీమానాలు జారీ చేసిన దుబాయ్ పోలీస్
- April 28, 2020
దుబాయ్ పోలీస్ మొత్తం 52,069 జరీమానాల్ని ఉల్లంఘనులకు జారీ చేయడం జరిగింది. నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ సందర్భంగా నిబంధనల్ని ఉల్లంఘించినవారికి ఈ జరీమానాలు విధించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 16 మధ్య మొత్తం 45,654 హెచ్చరికలు, 6,424 జరీమానాలు విధించారు. అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చినవారి విషయంలో 38,702 జరీమానాలు విధించడం జరిగింది. మెడికల్ మాస్క్లు వినియోగించని 10,286 మందికి కూడా జరీమానాలు విధించారు. వాహనంలో ముగ్గురికంటే ఎక్కువమంది ప్రయాణించడంతో 3,696 జరీమానాలు విధించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా దుబాయ్ పోలీస్ హెచ్చరించడం జరిగింది. ప్రైవేట్ దేరింగ్స్కి పాల్పడితే 10,000 దిర్హావ్ుల జరీమానా విధిస్తారు. అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ 5,000 దిర్హామ్ల జరీమానా తప్పదు. ఫిజికల్ డిస్టెన్స్ మెజర్స్ పాటించకపోతే 1,000 దిర్హామ్ల జరీమానా. మాస్క్లు ధరించనివారికి 1,000 దిర్హామ్ల జరీమానా. వాహనంలో ముగ్గురికంటే ఎక్కువమంది ప్రయాణిస్తే 1,000 దిర్హామ్ల జరీమానా.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







