కువైట్ లో భారత రాయబారిగా సిబి జార్జ్ నియామకం
- April 30, 2020
కువైట్:భారత ప్రభుత్వం పలు దేశాలలో కొత్త రాయబారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కువైట్ లోనూ భారత్ రాయబారిగా సిబి జార్జ్ ను నియమించింది. సిబి జార్జ్ 1993 బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. కేరళాలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన ఆయన..విద్యార్ధి దశ దశ నుంచే ప్రతిభను చాటుతూ వచ్చారు. గ్రాడ్యూయేషన్, పోస్ట్ గ్రాడ్యూయేషన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత 1993లో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తున్న సిబి జార్జికి..గతంలో వాషింగ్టన్ డీసీతో పాటు పలు ఇస్లాం దేశాల్లో భారత్ రాయబారిగా విధులు నిర్వహించిన అనుభవం ఉంది. ఇస్లామాబాద్, రియాద్, దోహా, కైరో, తెహ్రాన్ లో భారత రాయబారిగా ఉన్నారు. ఎక్కువగా ఇస్లాం దేశాల్లో విధులు నిర్వహించాల్సి రావటంతో అరబ్ భాషలో డిప్లోమా కూడా చేశారాయన. ఇదిలాఉంటే..ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా టీ.ఎస్. తిరుమూర్తిని భారత ప్రభుత్వం నియమించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







