విదేశీ పెట్టుబడిదారులకు 100 శాతం ఓనర్షిప్?
- January 28, 2016
విదేశీ పెట్టుబడిదారులకు ఒమన్లో రెడ్ కార్పెట్ వేయడానికి వీలుగా కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త చట్టం అమల్లోకి వస్తే 100 శాతం పెట్టుబడితే విదేశీయులు ఒమన్లో వ్యాపార కార్యకలాపాలు చేపట్టవచ్చు. ఇప్పటివరకూ ఉన్న చట్టం ప్రకారం కనీసం 35 శాతం వాటా ఒమన్ జాతీయులకు ఉంటేనే విదేశీయులు పెట్టుబడులు పెట్టడానికి వీలుండేది. దాన్ని మార్చి, పెట్టుబడిదారులను ఆకర్షించాలని ఒమన్ ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ పెట్టుబడిదారుల్ని ఆకర్షించే ప్రయత్నంలో కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పడంలేదని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. మారుతున్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్ని ఒమన్ అనుసరించక తప్పదని వారు అంటున్నారు. విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం ద్వారా దేశ ఆర్థిక రంగానికి ఊతమిచ్చినట్లవుతుందని అధికారిక వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం విదేశీ పెట్టుబడిదారులకు 150,000 ఒమర్ రియాల్స్ అనేది మినిమమ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. కొత్త చట్టాన్ని ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆహ్వానిస్తోంది. ఇది దేశ ఆర్థిక ప్రగతికి మేలు చేస్తుందని చాంబర్ ఆఫ్ కామర్స్ వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









