విదేశీ పెట్టుబడిదారులకు 100 శాతం ఓనర్షిప్?
- January 28, 2016
విదేశీ పెట్టుబడిదారులకు ఒమన్లో రెడ్ కార్పెట్ వేయడానికి వీలుగా కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త చట్టం అమల్లోకి వస్తే 100 శాతం పెట్టుబడితే విదేశీయులు ఒమన్లో వ్యాపార కార్యకలాపాలు చేపట్టవచ్చు. ఇప్పటివరకూ ఉన్న చట్టం ప్రకారం కనీసం 35 శాతం వాటా ఒమన్ జాతీయులకు ఉంటేనే విదేశీయులు పెట్టుబడులు పెట్టడానికి వీలుండేది. దాన్ని మార్చి, పెట్టుబడిదారులను ఆకర్షించాలని ఒమన్ ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ పెట్టుబడిదారుల్ని ఆకర్షించే ప్రయత్నంలో కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పడంలేదని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. మారుతున్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్ని ఒమన్ అనుసరించక తప్పదని వారు అంటున్నారు. విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం ద్వారా దేశ ఆర్థిక రంగానికి ఊతమిచ్చినట్లవుతుందని అధికారిక వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం విదేశీ పెట్టుబడిదారులకు 150,000 ఒమర్ రియాల్స్ అనేది మినిమమ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. కొత్త చట్టాన్ని ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆహ్వానిస్తోంది. ఇది దేశ ఆర్థిక ప్రగతికి మేలు చేస్తుందని చాంబర్ ఆఫ్ కామర్స్ వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







