ఉగ్రవాదం పై ఉక్కుపాదం--తెలంగాణా సీఎం
- January 28, 2016
ఉగ్రవాదం ఏ రూపంలో రాష్ట్రంలో ఉపేక్షించబోమని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. దానిని ఉక్కు చేతితో అణచివేస్తామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంగా ఇవాళ ఆయన తెలంగాణభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉగ్రవాదంపై ఓ విలేకరి ప్రశ్నించగా సీఎం పైవిధంగా స్పందించారు. తెలంగాణలో ఉగ్రవాద, అసాంఘీక శక్తుల ఆటలు సాగనీయబోమని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయని వివరించారు. లేకుంటే పెట్టుబడులు రావని తెలిపారు. పెట్టుబడులు వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో పోలీస్ కంట్రోల్ రూమ్ పనులు వేగవంతం చేస్తామన్నారు. దీని ద్వారా శాంతి భద్రతలు పరిరక్షించడం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









