ఉగ్రవాదం పై ఉక్కుపాదం--తెలంగాణా సీఎం
- January 28, 2016
ఉగ్రవాదం ఏ రూపంలో రాష్ట్రంలో ఉపేక్షించబోమని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. దానిని ఉక్కు చేతితో అణచివేస్తామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంగా ఇవాళ ఆయన తెలంగాణభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉగ్రవాదంపై ఓ విలేకరి ప్రశ్నించగా సీఎం పైవిధంగా స్పందించారు. తెలంగాణలో ఉగ్రవాద, అసాంఘీక శక్తుల ఆటలు సాగనీయబోమని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయని వివరించారు. లేకుంటే పెట్టుబడులు రావని తెలిపారు. పెట్టుబడులు వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో పోలీస్ కంట్రోల్ రూమ్ పనులు వేగవంతం చేస్తామన్నారు. దీని ద్వారా శాంతి భద్రతలు పరిరక్షించడం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







