విదేశాంగమంత్రి జైశంకర్కి వైఎస్ జగన్ లేఖ
- May 02, 2020
అమరావతి:కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్కు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని వైఎస్ జగన్ కోరారు. కువైట్, దుబాయ్లలో వలస వచ్చిన వారి రిజిస్ట్రేషన్ జరుగుతోందని, రిజిస్ట్రేషన్ సందర్బంగా కువైట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత ఎంబసీ అధికారులకు సూచనలు చేయాలని సీఎం వైఎస్ జగన్ కోరారు.
ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు, విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు సహకరించాలని కోరారు. రిజిస్ట్రేషన్ వివరాలను రాష్ట్రాలకు అందించాలని, ఫలితంగా తాము వారి క్వారంటైన్ కోసం ఏర్పాట్లు చేసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. గల్ఫ్, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలను సొంత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు ఏపీ సిద్ధంగా ఉందని, వారికి ఇబ్బందులు లేకుండా ఇండియాకు వచ్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రికి వైఎస్ జగన్ సూచించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







