COVID-19: యూఏఈ కి వైద్య సహాయం అందించనున్న భారత్

- May 02, 2020 , by Maagulf
COVID-19: యూఏఈ కి వైద్య సహాయం అందించనున్న భారత్

దుబాయ్: కరోనావైరస్ పై పోరాటంలో తమవంతు సాయం అందించేందుకు 88 మంది వైద్యులు మరియు నర్సులను యూఏఈ కి పంపటానికి భారత అధికారులు అనుమతి ఇచ్చినట్లు భారతదేశంలోని యూఏఈ రాయబార కార్యాలయం శనివారం ప్రకటించింది. "ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది" అని  భారత ప్రభుత్వం పేర్కొంది.

దుబాయ్‌లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, విపుల్ మాట్లాడుతూ " ఈ వైద్య బృందం యూఏఈ కి ప్రయాణించటానికి MEA (విదేశాంగ మంత్రిత్వ శాఖ) తన అనుమతి ఇచ్చింది మరియు మరిన్ని లాంఛనాలు త్వరలో పూర్తవుతాయి."

కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి భారతదేశం ఇంతకుముందు 15 మంది గల వైద్య బృందాన్ని కువైట్ కు పంపిన తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com