భారతదేశం నుంచి ముగ్గురు బిలియనీర్లు టాప్ 50 స్థానాల్లో..
- January 28, 2016
అత్యంత సంపన్నుల జాబితాలోని తొలి 50 స్థానాల్లో ముగ్గురు భారతీయులు స్థానం సంపాదించారు. ముఖేష్ అంబానీ, అజీమ్ ప్రేమ్జీ, దిలీప్ సంఘ్వీలకు చోటు దక్కింది. ఎప్పటిలాగానే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ 87.4 బిలియన్ డాలర్లుతో ప్రథమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. వెల్త్-ఎక్స్, బిజినెస్ ఇన్ సైడర్ సంయుక్తంగా రూపొందించిన జాబితాను గురువారం వెల్లడించారు. ఈ జాబితాలో ప్రముఖ వ్యాపార వేత్త ముఖేశ్ అంబానీ 24.8 బిలియన్ డాలర్లతో 27వ స్థానంలో నిలిచారు. విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ 16.5 బిలియన్ డాలర్లుతో 43వ స్థానం, సన్ ఫార్మాసిటికల్ వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ 16. 4 బిలియన్ డాలర్లుతో 44వ స్థానంలో ఉన్నారు. స్పానిష్ వ్యాపారవేత్త అమానికో ఓర్టెగా గవోనా 66.8 బిలియన్ డాలర్లు, వారెన్ బఫెట్ 60.7 బిలియన్ డాలర్లతో రెండు మూడు స్థానాల్లో నిలిచారు. అమెజాన్ జెఫ్రె- 56.6 బిలియన్ డాలర్లు, యూఎస్ వ్యాపారవేత్త డేవిడ్ కోచ్- 47.4 బిలియన్ డాలర్లతో నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకున్నారు. కొత్త జాబితా ప్రకారం యునైటెడ్ స్టేట్స్లో 29 మంది బిలియనీర్లు ఉండగా.. చైనా నుంచి నలుగురు బిలియన్లు.. భారతదేశం నుంచి ముగ్గురు బిలియనీర్లు టాప్ 50 స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







