భారతదేశం నుంచి ముగ్గురు బిలియనీర్లు టాప్ 50 స్థానాల్లో..
- January 28, 2016
అత్యంత సంపన్నుల జాబితాలోని తొలి 50 స్థానాల్లో ముగ్గురు భారతీయులు స్థానం సంపాదించారు. ముఖేష్ అంబానీ, అజీమ్ ప్రేమ్జీ, దిలీప్ సంఘ్వీలకు చోటు దక్కింది. ఎప్పటిలాగానే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ 87.4 బిలియన్ డాలర్లుతో ప్రథమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. వెల్త్-ఎక్స్, బిజినెస్ ఇన్ సైడర్ సంయుక్తంగా రూపొందించిన జాబితాను గురువారం వెల్లడించారు. ఈ జాబితాలో ప్రముఖ వ్యాపార వేత్త ముఖేశ్ అంబానీ 24.8 బిలియన్ డాలర్లతో 27వ స్థానంలో నిలిచారు. విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ 16.5 బిలియన్ డాలర్లుతో 43వ స్థానం, సన్ ఫార్మాసిటికల్ వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ 16. 4 బిలియన్ డాలర్లుతో 44వ స్థానంలో ఉన్నారు. స్పానిష్ వ్యాపారవేత్త అమానికో ఓర్టెగా గవోనా 66.8 బిలియన్ డాలర్లు, వారెన్ బఫెట్ 60.7 బిలియన్ డాలర్లతో రెండు మూడు స్థానాల్లో నిలిచారు. అమెజాన్ జెఫ్రె- 56.6 బిలియన్ డాలర్లు, యూఎస్ వ్యాపారవేత్త డేవిడ్ కోచ్- 47.4 బిలియన్ డాలర్లతో నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకున్నారు. కొత్త జాబితా ప్రకారం యునైటెడ్ స్టేట్స్లో 29 మంది బిలియనీర్లు ఉండగా.. చైనా నుంచి నలుగురు బిలియన్లు.. భారతదేశం నుంచి ముగ్గురు బిలియనీర్లు టాప్ 50 స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









