ముంబై లోకల్ రైల్వే స్టేషన్లలో చిరుత సంచారం
- January 28, 2016'లోకల్ రైల్వే స్టేషన్లలో చిరుత సంచారం' వార్తలు ముంబై వాసులను కాసేపు హడలగొట్టేశాయి. వేలమంది జనం, సాయుధ రైల్వే పోలీసుల నడుమ రైల్వే స్టేషన్ లో చిరుతపులి సంచారం సాధ్యమేనా? అనుకుంటూ యధావిధిగా స్టేషన్లకు వెళ్లినవారికి నిజంగానే పులల చిత్తరువులు కనిపించాయి.ఖర్, బోరీవ్యాలీ లోకల్ స్టేషన్ ఫ్లాట్ ఫామ్ మెట్లపై ఠీవిగా నిల్చున్న చిరుతపులి బొమ్మలు చూసి అవాక్కయిన ప్రయాణికులు.. వాటిని గీసినవాళ్లను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అంత అందంగా కుదిరాయా చిత్తరువులు. ఒక్క చిరుతపులేకాదు జీబ్రా, ఉదయిస్తున్న సూర్యుడు, పచ్చని చెట్లు తదితర బొమ్మలు స్టేషన్ గోడలపై అలరిస్తున్నాయి. రద్దీ ప్రదేశాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించేందుకు మేక్ ఎ డిఫరెన్స్(ఎంఏడీ) అనే స్వచ్ఛంద సంస్థ ఈ చిత్తరువుల పనిని చేపట్టింది.ఒక్క రైల్వే ష్టేషన్లేకాక నేషనల్ హైవేలు, బీచ్ లు, పార్కుల వంటి పబ్లిక్ ప్లేసెస్ లోనూ అందమైన బొమ్మలు ఫ్రీగా గీసిపెట్టేందుకు సిద్ధమవుతోంది ఎంఏడీ. ఖర్, బోరీవ్యాలీ స్టేషన్లలో కనువిందు చేస్తోన్న ఈ చిత్రరాజాలను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









