కోవిడ్ 19: దమామ్ లోని రెండో పారిశ్రామిక వాడ దిగ్బంధం
- May 03, 2020
సౌదీ అరేబియా:కరోనా వైరస్ కట్టడిలో తొలి నుంచి పకడ్బందీ చర్యలు చేపడుతున్న సౌదీ ప్రభుత్వం..వైరస్ తీవ్రత పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలను మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా దమామ్ ప్రాంతంలోని రెండో పారిశ్రామిక వాడను పూర్తిగా దిగ్బంధం చేసింది. ఇక నుంచి పారిశ్రామిక వాడ ప్రాంతానికి ఎవరిని అనుమతించబోమని, అలాగే ఇక్కడి నుంచి ఎవరిని బయటికి వెళ్లనివ్వబోమని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ ప్రబలకుండా చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే..సరుకు రవాణా వాహనాలకు మాత్రం అనుమతి ఉంటుందని, అలాగే కీలక కర్మాగారాల్లో పని చేసే ఉద్యోగులకు కూడా అనుమతి ఉంటుందని వివరించారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







