మస్కట్ : వైద్యశాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాల ఏర్పాటు

- May 03, 2020 , by Maagulf
మస్కట్ : వైద్యశాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాల ఏర్పాటు

మస్కట్ లోని వైద్యశాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం రెండు కేంద్రాలు సీబ్ స్టేడియం హాల్, సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లలో ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి రంజాన్ మాసం ముగిసే వరకు రక్తదానం చేయవచ్చని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతి రోజు దాతలు రక్తదానం చేయవచ్చని..మహిళా దాతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయితే..రక్తదానం చేయాలనుకునే దాతలు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 94555648 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయటం ద్వారా వివరాలను నమోదు చేసుకొని వారికి కేటాయించిన సమయంలో వెళ్లి రక్తాన్ని దానం చేయాలి. కరోనా నేపథ్యంలో ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com