దోహా: రమదాన్ మాసంలో ఆహార పదార్ధాల నాణ్యతపై తనిఖీలు ముమ్మరం

- May 04, 2020 , by Maagulf
దోహా: రమదాన్ మాసంలో ఆహార పదార్ధాల నాణ్యతపై తనిఖీలు ముమ్మరం

దోహా:పవిత్ర రమదాన్ మాసంలో ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించేలా దోహా మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్యాక్డ్ ఆహార పదార్ధాలు అమ్మే స్టోర్స్ తో పాటు ఆహార పదార్ధాల ఉత్పత్తి సంస్థలపై తనిఖీలు ముమ్మరం చేసింది. మున్సిపాలిటీలోని ప్రజా ఆరోగ్య విభాగం, వాణిజ్య, పారిశ్రామిక విభాగానికి చెందిన అధికారులు సంయుక్తంగా దోహాలోని పలు ప్రాంతాల్లో ఆహార పదార్ధాల నాణ్యాతను పరిశీలించేందుకు తనిఖీలు చేపట్టారు. గత నెలలోనూ దోహాలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి నాణ్యతా ప్రమాణాలు పాటించని పలు సంస్థలపై చర్యలు తీసుకున్నారు. 33 స్టోర్స్ నాణ్యత ప్రమాణాల నిబంధనలు ఉల్లంఘించాయని గుర్తించారు. అలాగే పారిశ్రామిక ప్రాంతాల నుంచి ప్యాక్డ్ ఫుడ్ ను సప్లై చేసే వాహనాలను కూడా తనిఖీలు చేపట్టి 15,000 వాహనాలను చెక్ చేశారు. ఇందులో రెండు వాహానాల్లోని ఆహార పదార్ధాల సరఫరాలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి వాటిని నిర్మూలించారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com