భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు
- May 07, 2020
భారత దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారీ విజృంభిస్తోంది. 24 గంటల్లో వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54 వేలు దాటింది. ఇప్పటివరకు 18వందల మందికి పైగా కరోనాతో చనిపోయారు. దాదాపు 16 వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 37వేలు ఉన్నాయి.
మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు 17వేలకు చేరువవుతున్నాయి. అక్కడ 650మందికిపైగా కరోనాతో చనిపోయారు. ఆ తర్వాత స్థానంలో గుజరాత్ ఉంది. ఈ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఆరున్నర వేలు దాటింది. ఇక్కడ కరోనాతో 400 మంది చనిపోయారు. ఢిల్లీలోనూ కేసుల సంఖ్య ఐదున్నరవేలు దాటింది. తమిళనాడులో ఒక్కరోజే దాదాపు 600 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. కేసుల సంఖ్య ఐదున్నరవేలకు చేరువలో ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఇప్పటివరకు మూడువేల చొప్పున కేసులు నమోదయ్యాయి. ఏపీలో 18 వందల 33కు చేరగా.. పంజాబ్, పశ్చిమబెంగాల్లో కేసుల సంఖ్య 15వందలు దాటిపోయాయి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు