11,000 మంది ఖైదీలకు బెయిల్
- May 08, 2020
ముంబై:ముంబై నగరంలోని ఆర్థర్ రోడ్ జైలులో 103 మందికి వైరస్ సోకింది. కరోనా సోకిన ఖైదీలను, జైలు ఉద్యోగులను శుక్రవారం ఉదయం ఆస్పత్రులకు తరలించారు. గతంలో మాదకద్రవ్యాల కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. అతనికి పాజిటివ్ అని వచ్చింది దాంతో అతడితో పాటు ఉన్న మిగతా ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కోవిడ్ రోగులున్న కస్తుర్బా ఆస్పత్రికి ఎదురుగా ఆర్థర్ రోడ్ జైలు ఉంది. నిత్యావసరాలు సరఫరా చేసే వ్యక్తుల ద్వారా కరోనా సోకి ఉంటుందని జైలు అధికారులు భావిస్తున్నారు. నిజానికి ఈ జైల్లో 800 మంది ఖైదీలను మాత్రమే ఉంచాలి. కానీ 2600 మంది ఉన్నారు. దాంతో రద్దీగా ఉండడంతో కరోనా వచ్చి వుంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, జైల్లో కరోనా కేసులు వెలుగు చూసినందున చిన్న చిన్న నేరాలు చేసి జైల్లో ఉన్న 11 వేల మంది ఖైదీలను విడుదల చేసే యోచనలో ఉంది మహారాష్ట్ర సర్కారు. హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఖైదీల బంధువులు వారికి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే న్యాయవాదులను సంప్రదిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







