కువైట్ నివాసితులకు షాక్...
- May 08, 2020
కువైట్ లో స్థిరపడ్డ భారతీయులను ఇక్కడ నుంచి స్వదేశానికి తరలించే ప్రక్రియ కుంటుపడింది. వందేభారత్ మిషన్ లో భాగంగా భారతీయులను స్వదేశానికి శుక్రవారం నుంచి పంపాలన్న నిర్ణయం అమలులో జాప్యం జరుగుతోంది. అందిన సమాచారం ప్రకారం అనుకున్న సమయానికి కువైట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించకపోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి కువైట్ నుంచి 5 విమాన సర్వీసులు హైదరాబాద్, కొచ్చి, చెన్నై, అహ్మదాబాద్, కోజికోడ్ లకు పంపాల్సి ఉంది. అయితే ఇప్పటికీ దానికి సంబంధించిన అనుమతి రాలేదు. అక్రమంగా నివసిస్తున్న వేలాదిమంది భారతీయులను తమదేశానికి తిరిగి తీసుకువెళ్లాలని గతంలోనే భారత ప్రభుత్వాన్ని కువైట్ కోరింది. అయితే, ఇప్పటికీ భారత్ నుంచి ప్రతిస్పందన రాలేదని కువైట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







