కువైట్ నివాసితులకు షాక్...

- May 08, 2020 , by Maagulf
కువైట్ నివాసితులకు షాక్...

కువైట్ లో స్థిరపడ్డ భారతీయులను ఇక్కడ నుంచి స్వదేశానికి తరలించే ప్రక్రియ కుంటుపడింది. వందేభారత్ మిషన్ లో భాగంగా భారతీయులను స్వదేశానికి శుక్రవారం నుంచి పంపాలన్న నిర్ణయం అమలులో జాప్యం జరుగుతోంది. అందిన సమాచారం ప్రకారం అనుకున్న సమయానికి కువైట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించకపోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి కువైట్ నుంచి 5 విమాన సర్వీసులు హైదరాబాద్, కొచ్చి, చెన్నై, అహ్మదాబాద్, కోజికోడ్ లకు పంపాల్సి ఉంది. అయితే ఇప్పటికీ దానికి సంబంధించిన అనుమతి రాలేదు. అక్రమంగా నివసిస్తున్న వేలాదిమంది భారతీయులను తమదేశానికి తిరిగి తీసుకువెళ్లాలని గతంలోనే భారత ప్రభుత్వాన్ని కువైట్ కోరింది. అయితే, ఇప్పటికీ భారత్ నుంచి ప్రతిస్పందన రాలేదని కువైట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com