ఒమన్:ప్రవాసులకు భారత రాయబార కార్యాలయం అండ
- May 08, 2020
మస్కట్:కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం తన కార్యక్రమాలు నిర్వహించడంలో ఏమాత్రం వెనుకంజ వేయటం లేదు. పైగా ఒమన్ లో నివసిస్తున్న భారతీయులకు మరింత చురుకైన సేవలను అందిస్తోంది. అత్యవసర సమయంలో ముందుగా సమయ నిర్ధారణ చేసుకొని నేరుగా కలవచ్చని తెలిపింది. ఇందుకోసం రెండు ఫోన్ నంబర్ లను ప్రత్యేకంగా కేటాయించింది. పాస్ పోర్ట్ పునరుద్ధరణ కోసం 79806929, ఏటేస్టేషన్ కోసం 93584040 కు సంప్రదించాలన్నారు.
మస్కట్ గాని ఇతర ప్రదేశాల్లో ఉన్న నిర్దేశిత శాఖల్లో ప్రపంచ కరెన్సీ మార్పిడి చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ శాఖ గుర్తించనప్పటికీ ఫిబ్రవరి1 వ తేదీ 2020 తర్వాత జన్మించిన బిడ్డల రిజిస్ట్రేషన్ ను తాత్కాలిక పద్ధతిలో అంగీకరించనున్నారు. అయితే, బిడ్డపుట్టిన విషయాన్ని ధృవీకరిస్తూ సంబంధిత వైద్యశాల ద్వారా లభించిన వర్తమానం చూపించిన పిదప రాయబార కార్యాలయంలో జనన ధ్రువీకరణ పత్రానికోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







