వందే భారత్ మిషన్:దోహా నుంచి కేరళ విమానం రద్దు

- May 10, 2020 , by Maagulf
వందే భారత్ మిషన్:దోహా నుంచి కేరళ విమానం రద్దు

దోహా:వందే భారత్ మిషన్ లో భాగంగా దోహా నుంచి తిరువనంతపురం రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం IX 374 రద్దు అయినట్టు ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3:35 గంటలకు విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా ఖతర్‌లోని అధికారుల నుంచి క్లియరెన్స్ లభించలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో విమానం రద్దు అయినట్టు తెలిపారు. ఖతర్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు వెళ్లిన రెండో విమానం ఇది. విమానాన్ని తర్వాత తేదీకి రీషెడ్యూల్ చేయనున్నట్టు అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com