ఆంధ్ర ప్రదేశ్ లో క్వారంటైన్ వివరాలు వివరిస్తున్న APNRTS ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్
- May 12, 2020
విజయవాడ: విదేశాల నుండి తిరిగివస్తున్న వారి కోసం చేపడుతున్న చర్యలను ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి వివరించారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వందే భారత్ మిషన్ ద్వారా విమానాలు ఏర్పాటు చేసి, చాలామంది భారతీయులను వెనక్కి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు అధిక సంఖ్యలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, త్రివేండ్రం విమానాశ్రయాలకు వస్తున్నారు. అయితే వచ్చే వారం మే 16 నుండి 22 వరకు ఉన్న షెడ్యూల్ లో నేరుగా ఏపీ లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతికి విమానాలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే వారికోసం చేయవలసిన అన్ని ఏర్పాట్లను, తీసుకోవలసిన చర్యలను కృష్ణ బాబు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కోవిడ్-19 టాస్క్ ఫోర్సు చైర్మన్ ఆధ్వర్యం లో, కలెక్టర్లు, పోలీస్ యంత్రాంగం, ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయము తో జరుపుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఉచిత క్వారంటైన్ కేంద్రాలను అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయడంతో పాటు పెయిడ్ క్వారంటైన్ కేంద్రాలలో ఉండాలనుకుంటున్న వారి కొరకు జిల్లా స్థాయిలో 3 స్టార్ హోటల్స్ తో మాట్లాడి క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వెంకట్ ఎస్ మేడపాటి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







