రెండు బ్లాక్బస్టర్ మూవీస్, ఒక వెబ్ ఫిల్మ్ ను విడుదల చేస్తున్న ఆహా
- May 13, 2020
సినిమాలు, వెబ్సిరీస్లతో వందశాతం తెలుగు వారికి సొంతమైన ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహా. ఇప్పటికే తెలుగు వారికి ఎంతో చేరువైన ఈ ఓటీటీ రీసెంట్గా ఓ రికార్డ్ను క్రియేట్ చేసింది. దుల్కర్ సల్మాన్, రీతూవర్మ నటించిన కనులు కనులను దోచాయంటే సినిమాను విడుదల చేసిన వారం రోజులకే 10 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ను క్రాస్ చేసింది.
ఫిబ్రవరిలో ఆహా ఓటీటీ ఫ్లాట్ఫామ్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి అత్యధికంగా వీక్షకులను ఆకట్టుకుంటూ తెలుగు ఎంటర్టైన్మెంట్ పరంగా ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. కొత్త కంటెంట్ కోసం మరింత డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో మూడు బ్లాక్బస్టర్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది ఆహా.
నేచురల్స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం చిత్రాన్ని మే 8న విడుదల చేసారు. శ్రీవిష్ణు, నివేదా పేతురాజ్ జంటగా నటించిన మెంటల్ మదిలో సినిమాను మే 15న విడుదల చేస్తున్నారు. అలాగే మర్డర్ మిస్టరీ కంటెంట్తో రూపొందిన ఆహా ఒరిజినల్ రన్ను మే 29న ప్రసారం చేస్తున్నారు. నవదీప్, పూజితా పొన్నడ నటించిన ఈ వెబ్ ఫిల్మ్ ను ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఆహా ఓటీటీలో బ్లాక్బస్టర్ చిత్రాలు, క్లాసిక్ చిత్రాలు, వెబ్ సిరీస్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ఆహా మరింత దగ్గరవుతుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







