ఏపీ: కొత్తగా 57 కరోనా కేసులు

- May 19, 2020 , by Maagulf
ఏపీ: కొత్తగా 57 కరోనా కేసులు

అమరావతి: ఏపీ‌లో కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,739 శాంపిల్స్‌ని పరీక్షించగా 57 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 69 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో చిత్తూర్, కర్నూల్‌లో ఒక్కొక్కరు మరణించారు. ఇప్పటి వరకు నమోదైన మొత్తం 2339 పాజిటివ్ కేసు‌లకుగానూ 1596 మంది డిశ్చార్జ్ కాగా, 52 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 691.  

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com