50 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య

- May 21, 2020 , by Maagulf
50 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య

దాదాపు 5 నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ బారినపడ్డవారి సంఖ్య అక్షరాలా 50 లక్షలు దాటింది. చైనాలో గత ఏడాది వెలుగు చూసిన కరోనా వైరస్‌… భూమండలాన్ని చుట్టుముట్టి తన గుప్పిట్లో బంధించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది. ఏరోజుకారోజు… కేసుల ఉధృతి పెరుగతూనే పోతోంది. వైరస్‌ వెలుగు చూసిన చైనాలో బీభత్సం సృష్టించిన వైరస్…. ఆ తర్వాతి కాలంలో యూరప్‌ను అతలాకుతలం చేసింది. అక్కడ కేసుల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినట్టే కనిపించినా.. అగ్ర రాజ్యాన్ని పూర్తిస్థాయిలో కుదిపేసింది. ఒక్క అమెరికాలోనే.. 15 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌లు విధించడం వల్ల.. ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలడంతో… దేశాలన్నీ చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది.

ప్రపంచవ్యాప్తంగా.. ఇప్పటి వరకు కరోనా బారినపడి 3 లక్షల 26 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. వీటిలో దాదాపు లక్ష మరణాలు.. ఒక్క అమెరికాలోనే సంభవించడం… అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యూరప్, అమెరికాల్లో ఒక రేంజ్‌లో మృత్యు క్రీడ సాగించిన కరోనా… క్రమంగా రష్యా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో విస్తరిస్తోంది. రష్యా, బ్రెజిల్‌ దేశాల్లో ప్రతీ రోజు యావరేజ్‌గా… 10 వేల కేసులు నమోదవుతున్నాయి. బ్రెజిల్‌లో తాజాగా… దాదాపు 12 మంది కరోనా కోరల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. ఆదేశంలో మహమ్మారి ప్రబలాక.. ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తం మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. అటు బ్రెజిల్‌లో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 75 వేలు దాటింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com