50 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య
- May 21, 2020దాదాపు 5 నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ బారినపడ్డవారి సంఖ్య అక్షరాలా 50 లక్షలు దాటింది. చైనాలో గత ఏడాది వెలుగు చూసిన కరోనా వైరస్… భూమండలాన్ని చుట్టుముట్టి తన గుప్పిట్లో బంధించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది. ఏరోజుకారోజు… కేసుల ఉధృతి పెరుగతూనే పోతోంది. వైరస్ వెలుగు చూసిన చైనాలో బీభత్సం సృష్టించిన వైరస్…. ఆ తర్వాతి కాలంలో యూరప్ను అతలాకుతలం చేసింది. అక్కడ కేసుల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినట్టే కనిపించినా.. అగ్ర రాజ్యాన్ని పూర్తిస్థాయిలో కుదిపేసింది. ఒక్క అమెరికాలోనే.. 15 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి నివారణకు లాక్డౌన్లు విధించడం వల్ల.. ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలడంతో… దేశాలన్నీ చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది.
ప్రపంచవ్యాప్తంగా.. ఇప్పటి వరకు కరోనా బారినపడి 3 లక్షల 26 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. వీటిలో దాదాపు లక్ష మరణాలు.. ఒక్క అమెరికాలోనే సంభవించడం… అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యూరప్, అమెరికాల్లో ఒక రేంజ్లో మృత్యు క్రీడ సాగించిన కరోనా… క్రమంగా రష్యా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో విస్తరిస్తోంది. రష్యా, బ్రెజిల్ దేశాల్లో ప్రతీ రోజు యావరేజ్గా… 10 వేల కేసులు నమోదవుతున్నాయి. బ్రెజిల్లో తాజాగా… దాదాపు 12 మంది కరోనా కోరల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. ఆదేశంలో మహమ్మారి ప్రబలాక.. ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తం మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. అటు బ్రెజిల్లో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 75 వేలు దాటింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం