యూఏఈ:వేసవి సెలవుల తేదీలను ఖరారు చేసిన విద్యాశాఖ
- May 21, 2020
యూఏఈలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వేసవి సెలవులను ఖరారు చేసింది విద్యా మంత్రిత్వ శాఖ. ముందస్తుగా ప్రకటించినట్లుగానే జులై 2 నుంచి విద్యాశాఖ సిలబస్ పాటించే అన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రారంభం అవుతాయని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఏర్పడిన అంతరాయం కారణంగా వేసవి సెలవులను మార్చబోవటం లేదని కూడా స్పష్టం చేశారు. ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే వేసవి సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. విద్యార్ధులకు జులై 2 నుంచి సెలవులు ప్రారంభం అయితే..స్కూల్ స్టాఫ్ కు మాత్రం వారం ఆలస్యంగా జులై 9 నుంచి సెలవులు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇక వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పుడే ఏ నిర్ణయమూ చెప్పలేమని కూడా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై సెప్టెంబర్ లో ఆనాటి పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సెప్టెంబర్ నాటికి దేశంలో కరోనా తీవ్రతను బట్టి స్కూళ్లను ప్రారంభించాలా? వర్చువల్ స్టడీస్ కొనసాగించాలా? అనేది నిర్ణయించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







