యూఏఈ:వేసవి సెలవుల తేదీలను ఖరారు చేసిన విద్యాశాఖ
- May 21, 2020
యూఏఈలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వేసవి సెలవులను ఖరారు చేసింది విద్యా మంత్రిత్వ శాఖ. ముందస్తుగా ప్రకటించినట్లుగానే జులై 2 నుంచి విద్యాశాఖ సిలబస్ పాటించే అన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రారంభం అవుతాయని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఏర్పడిన అంతరాయం కారణంగా వేసవి సెలవులను మార్చబోవటం లేదని కూడా స్పష్టం చేశారు. ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే వేసవి సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. విద్యార్ధులకు జులై 2 నుంచి సెలవులు ప్రారంభం అయితే..స్కూల్ స్టాఫ్ కు మాత్రం వారం ఆలస్యంగా జులై 9 నుంచి సెలవులు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇక వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పుడే ఏ నిర్ణయమూ చెప్పలేమని కూడా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై సెప్టెంబర్ లో ఆనాటి పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సెప్టెంబర్ నాటికి దేశంలో కరోనా తీవ్రతను బట్టి స్కూళ్లను ప్రారంభించాలా? వర్చువల్ స్టడీస్ కొనసాగించాలా? అనేది నిర్ణయించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







