హెచ్చరిక: యూఏఈ నుంచి ఇండియాకి చార్టెడ్ విమానాల్లేవ్
- May 25, 2020
దుబాయ్:దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్, ఇండియన్ నేషనల్స్ని ఉద్దేశించి ఓ హెచ్చరిక ప్రకటన చేసింది. ఇండియాకి చార్టెడ్ విమానాలంటూ కొందరు మోసగాళ్ళు టిక్కెట్లను అమ్మేస్తున్నారని, అలాంటివారి మాయలో పడొద్దని ప్రకటనలో హెచ్చరించింది కాన్సులేట్. కొందరు వ్యక్తులు, కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు యూఏఈలోని భారతీయులను సంప్రదించి, చార్టెడ్ విమానాల్లో భారతదేశానికి పంపిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందనీ, అలాంటి అవకాశమేదీ ప్రస్తుతానికి లేదని కాన్సులేట్ తేల్చి చెప్పింది. ఇలాంటి మోసాలకు సంబంధించి భారతీయులు అప్రమత్తంగా వుండాలనీ, ఏవైనా అనుమానాలుంటే భారత కాన్సులేట్ని సంప్రదించాలని కాన్సులేట్ జనరల్ పేర్కొంది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







