హెచ్చరిక: యూఏఈ నుంచి ఇండియాకి చార్టెడ్ విమానాల్లేవ్
- May 25, 2020
దుబాయ్:దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్, ఇండియన్ నేషనల్స్ని ఉద్దేశించి ఓ హెచ్చరిక ప్రకటన చేసింది. ఇండియాకి చార్టెడ్ విమానాలంటూ కొందరు మోసగాళ్ళు టిక్కెట్లను అమ్మేస్తున్నారని, అలాంటివారి మాయలో పడొద్దని ప్రకటనలో హెచ్చరించింది కాన్సులేట్. కొందరు వ్యక్తులు, కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు యూఏఈలోని భారతీయులను సంప్రదించి, చార్టెడ్ విమానాల్లో భారతదేశానికి పంపిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందనీ, అలాంటి అవకాశమేదీ ప్రస్తుతానికి లేదని కాన్సులేట్ తేల్చి చెప్పింది. ఇలాంటి మోసాలకు సంబంధించి భారతీయులు అప్రమత్తంగా వుండాలనీ, ఏవైనా అనుమానాలుంటే భారత కాన్సులేట్ని సంప్రదించాలని కాన్సులేట్ జనరల్ పేర్కొంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







