విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులపై ఇండియా తాజా గైడ్లైన్స్
- May 25, 2020
మస్కట్: భారత హోం మంత్రిత్వ శాఖ, విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల విషయంలో తాజా స్టాండర్డ్ ఆపరేటింగ్ రపొసిడ్యూర్స్ని విడుదల చేసింది. ఇండియాకి తిరిగి వచ్చేయాలనుకున్నవారు, ఆయా దేశాల్లోని ఇండియన్ మిషన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ సూచన మేరకు అవసరమైన వివరాల్ని అందులో పొందుపర్చాల్సి వుంటుంది. స్వదేశానికి చేరుకున్నాక 14 రోజుల క్వారంటైన్కి ఒప్పుకుంటూ సంతకం చేయాల్సి వుంటుంది. ఏడు రోజుల సెల్ఫ్ పెయిడ్ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్, ఏడు రోజుల హోం ఐసోలేషన్ ఇందులో వుంటుంది. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏర్పాటు చేసే నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ విమినాలు అలాగే మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ / డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ ఎఫైర్స్ ఏర్పాటు చేసే షిప్స్ ద్వారా స్వదేశానికి చేరుకోవాల్సి వుంటుంది. డిస్ట్రెస్తో వున్నవారు, లెయిడ్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్, షార్ట్ టెర్మ్ వీసా హోల్డర్స్, ప్రెగ్నెంట్ విమెన్, పెద్దవారు అలాగే మెడికల్ ఎమర్జన్సీ వున్నవారికి, విద్యార్థులకు తొలుత ప్రాధాన్యతనిస్తారు. ప్రయాణ ఖర్చులు వారే భరించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు