భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు
- May 26, 2020
రెండు నెలల లాక్డౌన్ అనంతరం సడలింపుల్లో భాగంగా జనం రోడ్లపైకి వస్తున్నారు. కరోనా వారి కోసమే కాచుక్కూర్చున్నట్టుంది. వెంటనే అటాక్ చేస్తోంది. అందుకే గత నాలుగైదు రోజులుగా దేశంలో నిత్యం 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే కొత్త కేసులు 6535రాగా, 146 మరణాలు సంభవించడంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,45,380కి చేరింది. అయితే ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4167 అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.
మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 60,491 మంది కోలుకోగా 80,722 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. గడచిన వారం రోజుల్లోనే దేశంలో దాదాపు 45 వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. లాక్డౌన్ కాలంలో మొత్తంగా లక్ష కేసులు నమోదైతే.. కేవలం వారం రోజుల వ్యవధిలో 45వేల కేసులు నమోదవండంతో వైరస్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందీ తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ రాష్ట్రాల్లో అయితే కేసుల సంఖ్య రోజు రోజుకీ అధికమవుతోంది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..