పూరీ ఆటోజానీలో రవితేజ..
- January 30, 2016
రవితేజ ఇటీవల బెంగాల్ టైగర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా, ఈ చిత్రం మంచి సక్సెస్నే సాధించింది. ఇక తాజాగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఎవడో ఒకడు చిత్రాన్ని చేస్తోన్న రవితేజ తన తర్వాతి ప్రాజెక్టులను సుధీర్ వర్మ, చక్రిలతో చేయనున్నారు. ఈ క్రమంలో పూరీతోను ఓ చిత్రాన్ని చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.రవితేజ, పూరీ కాంబినేషన్లో 5 చిత్రాలు తెరకెక్కగా ఇందులో మూడు మంచి విజయం సాధించాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కగా తాజాగా చిరు కోసం తయారు చేసిన ఆటో జాని స్టోరీను రవితేజతో పూరి తెరకెక్కించనున్నట్టు సమాచారం.చిరు కోసం తయారు చేసిన కథలో కొన్ని మార్పులు చేసి రవితేజకు వినిపించగా, అందుకు మాస్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పూరీ ప్రస్తుతం రోగ్ అనే చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిస్తోండగా, ఈ సినిమా పూర్తైన తర్వాత ఆటోజానీ ను పట్టాలెక్కించనున్నట్టు టాక్.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







