కోవిడ్19:దుబాయ్లో కొత్త సడలింపులు ఇవే..
- May 26, 2020
దుబాయ్:కరోనా వైరస్ నేపథ్యంలో కఠిన తరమైన లాక్డౌన్ నుంచి క్రమక్రమంగా సడలింపులు లభిస్తున్నాయి. తాజా సడలింపుల నేపథ్యంలో రోడ్లపై జనం కాస్త ఎక్కువగానే కన్పిస్తున్నారు. మే 27 నుంచి అమల్లోకి వచ్చిన సడలింపులు ఇలా వున్నాయి.రెసిడెంట్స్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మామూలుగానే తిరగవచ్చు.దుబాయ్ ఎయిర్ పోర్ట్, దేశంలోకి తిరిగి రావాలనుకునేవారి కోసం తెరిచి వుంటుంది. జిమ్ లు, ఫిట్నెస్ సెంటర్లు తెరిచి వుంటాయి. సోషల్ డిస్టెన్సింగ్, ఎప్పటికప్పుడు స్టెరిలైజేషన్ తప్పనిసరి.దుబాయ్ రిటెయిల్ స్టోర్స్, హోల్సేల్ ఔట్లెట్స్ రీ-ఓపెన్ అవుతున్నాయి. ఇన్టి క్లినిక్స్, పిల్లల హెల్త్ సెంటర్స్ తెరిచి వుంటాయి. రెండున్నర నెలలుగా ఆగిపోయిన సర్జరీలు తిరిగి కొనసాగుతాయి. సినిమాలు తిరిగి ప్రారంభమవుతాయి. సోషల్ డిస్టెన్సింగ్, స్టెరిలైజేషన్ తప్పదు. ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ మరియు రిక్రియేషనల్ వెన్యూస్ రీ-ఓపెన్ అవుతాయి. అన్ని గవర్నమెంట్ సెంటర్స్ (అమెర్, తషీల్ వంటివి) తెరవబడ్తాయి. ఆన్లైన్ ఆక్షన్స్ నిర్వహించలేని ఆక్షన్ హౌస్లు తెరుచుకోవచ్చు. కాగా, మాస్క్లు తప్పనిసరిగా ధరించాల్సి వుంటుంది. 2 మీటర్ల సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. దేశంలోకి వచ్చే ప్రయాణీకులంతా 14 రోజుల క్వారంటైన్కి ఒప్పుకోవాలి. 12 ఏళ్ళ లోపు పిల్లలు, 60 ఏళ్ళ పైబడినవారు, క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్నవారు షాపింగ్ సెంటర్స్, సినిమాలు, జిమ్ లు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రవేశించడానికి వీల్లేదు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







