మరిన్ని క్వారంటైన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయనున్న కువైట్
- May 26, 2020
కువైట్:కువైట్ ప్రభుత్వం, కరోనా వైరస్ నేపథ్యంలో కార్మికుల కోసం మరిన్ని క్వారంటైన్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. తాండం స్పోర్ట్ క్లబ్లోని హాల్స్ని అప్పగించాల్సిందిగా పబ్లిక్ అథారిటీ ఆఫ్ స్పోర్ట్కి క్యాబినెట్ ఆదేశించడం జరిగింది. ఈ హాల్స్ని ఫర్వానియా హాస్పిటల్కి సపోర్ట్గా ఎమర్జన్సీ యూనిట్ ఏర్పాటు చేసేలా తీర్చిదిద్దనున్నారు. క్యాబినెట్ భేటీకి సంబంధించిన వివరాల్ని పభ్రుత్వ అధికార ప్రతినిది¸ తారెక్ అల్ మెజ్రెమ్ ఆన్లైన్ న్యూస్ కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్తో బాధపడుతున్న కార్మికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిందిగా కంపెనీలకు క్యాబినెట్ సూచించినట్లు తెలిపారు తారెక్ అల్ మజ్రెమ్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, హోటల్స్ని క్వారెంటైన్ ఫెసిలిటీస్కి వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటుందని క్యాబినెట్ పేర్కొంది. లైవ్ స్టాక్ ఓనర్స్కి ఫోడర్ని అందించేందుకు కువైట్ ఫ్లోర్ మిల్స్ కంపెనీతో సమన్వయం చేయాలని పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చరల్ ఎఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్కి క్యాబినెట్ సూచించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







