భారత్:గత 24 గంటల్లో 194 మంది మృతి
- May 28, 2020
కరోనా మహమ్మారి భారత్లో అంతకంతకూ విస్తరిస్తోంది. అటు మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు కూడా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,566 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 194 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,333కు చేరుకోగా, మృతుల సంఖ్య 4,531కు చేరింది. ఈ వైరస్ నుంచి ఇప్పటివరకు 67,692 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
మరో పక్క తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న రికార్డు స్థాయిలో కొత్తగా 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 39.. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 68 మందికి వ్యాధి సోకింది. ఇక న్మిన్న కరోనా భారిన పడి ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 63మంది కరోనాతో మృతి చెందారు. ఇక కరోనా పాజిటివ్ మొత్తం కేసుల సంఖ్య 2098కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1321మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 714 మంది కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







