భారత్:గ‌త 24 గంట‌ల్లో 194 మంది మృతి

- May 28, 2020 , by Maagulf
భారత్:గ‌త 24 గంట‌ల్లో 194 మంది మృతి

కరోనా మహమ్మారి భారత్‌లో అంతకంతకూ విస్తరిస్తోంది.  అటు మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు కూడా పాజిటివ్‌ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,566 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 194 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,58,333కు చేరుకోగా, మృతుల సంఖ్య 4,531కు చేరింది. ఈ వైరస్‌ నుంచి ఇప్పటివరకు  67,692 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

మరో పక్క తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న రికార్డు స్థాయిలో కొత్తగా 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 39.. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 68 మందికి వ్యాధి సోకింది. ఇక న్మిన్న కరోనా భారిన పడి ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 63మంది కరోనాతో మృతి చెందారు. ఇక కరోనా పాజిటివ్ మొత్తం కేసుల సంఖ్య 2098కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1321మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 714 మంది కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com