సోషల్ మీడియాను బంద్ చేస్తాను:ట్రంప్
- May 28, 2020
అమెరికా: అమెరికా అద్యక్షడు ట్రంప్ సోషల్ మీడియాపై చిందులు వేస్తున్నారు. సోషల్ మీడియా సంస్థలను బంద్ చేస్తానని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ చేసిన ట్విట్ లపై.. ట్విట్టర్ ప్యాక్ చెక్ ద్వారా షాకిచ్చింది. దీంతో ట్రంప్ ఈ మేరకు మండిపడుతున్నారు. కరోనా నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోస్టల్ ఓటింగ్ అమలుపై కాలిఫోర్నియా ప్రయత్నిస్తుంది. అయితే, ట్రంప్ దీనిపై ట్వీటర్ వేదికగా స్పందిస్తూ.. మెయిల్ ఇన్ ఓటింగ్ ద్వారా.. ఎన్నికలు జరిగితే.. రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని అన్నారు. దీంతో ట్రంప్ ట్వీట్లపై.. ట్వీటర్.. ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఈ ట్వీట్లు సత్యదూరమైనవని.. మెయిల్ ఇన్ ఓటింగ్ ద్వారా రిగ్గింగ్ జరిగే అవకాశం లేదని తేల్చింది. అవి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ముద్ర వేసింది. దీంతో ట్రంప్ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. సోషల్ మీడియాను బ్యాన్ చేస్తానంటూ ద్వజమెత్తారు. అమెరికా అద్యక్ష ఎన్నికల్లో సోషల్ మీడియా తలదూర్చుతోందని అన్నారు.
ట్వీటర్ ఇలా చేయడమంటే.. వాక్ స్వతంత్ర్యాన్ని అడ్డుకోవడమేనని.. తమ గొంతు నొక్కేందుకు టెక్ కంపెనీలు ప్రత్నిస్తున్నాయని అన్నారు. అయితే, ఈ లోపే వాటిని బంద్ చేసే విధంగా చట్టాలు తీసుకొని వచ్చే ఆలోచనలో ఉన్నామని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







