సోషల్ మీడియాను బంద్ చేస్తాను:ట్రంప్
- May 28, 2020
అమెరికా: అమెరికా అద్యక్షడు ట్రంప్ సోషల్ మీడియాపై చిందులు వేస్తున్నారు. సోషల్ మీడియా సంస్థలను బంద్ చేస్తానని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ చేసిన ట్విట్ లపై.. ట్విట్టర్ ప్యాక్ చెక్ ద్వారా షాకిచ్చింది. దీంతో ట్రంప్ ఈ మేరకు మండిపడుతున్నారు. కరోనా నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోస్టల్ ఓటింగ్ అమలుపై కాలిఫోర్నియా ప్రయత్నిస్తుంది. అయితే, ట్రంప్ దీనిపై ట్వీటర్ వేదికగా స్పందిస్తూ.. మెయిల్ ఇన్ ఓటింగ్ ద్వారా.. ఎన్నికలు జరిగితే.. రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని అన్నారు. దీంతో ట్రంప్ ట్వీట్లపై.. ట్వీటర్.. ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఈ ట్వీట్లు సత్యదూరమైనవని.. మెయిల్ ఇన్ ఓటింగ్ ద్వారా రిగ్గింగ్ జరిగే అవకాశం లేదని తేల్చింది. అవి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ముద్ర వేసింది. దీంతో ట్రంప్ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. సోషల్ మీడియాను బ్యాన్ చేస్తానంటూ ద్వజమెత్తారు. అమెరికా అద్యక్ష ఎన్నికల్లో సోషల్ మీడియా తలదూర్చుతోందని అన్నారు.
ట్వీటర్ ఇలా చేయడమంటే.. వాక్ స్వతంత్ర్యాన్ని అడ్డుకోవడమేనని.. తమ గొంతు నొక్కేందుకు టెక్ కంపెనీలు ప్రత్నిస్తున్నాయని అన్నారు. అయితే, ఈ లోపే వాటిని బంద్ చేసే విధంగా చట్టాలు తీసుకొని వచ్చే ఆలోచనలో ఉన్నామని అన్నారు.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







